దేశ రాజధాని ఢిల్లీ లో మెట్రో బ్లూలైన్ వెంబడి మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఓ వ్యక్తి మెట్రో రైల్వే ట్రాక్పై దూకడంతో రైలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. ద్వారకా వెళ్తున్న మెట్రో రైలు యమునా సెక్షన్లోని కౌసంబి స్టేషన్ ఫ్లాట్పాం వద్దకు రాగానే ఓ ప్రయాణికుడు రైలులో నుంచి మెట్రో ట్రాక్ లపై దూకాడు. మెట్రో సిబ్బంది అప్రమత్తమై ఆ ప్రయాణికుడిని రక్షించారని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనతో ఉదయం 9.56 గంటల నుంచి 10.03 గంటల ప్రాంతంలో రైలు సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత తిరిగి మెట్రో రైళ్లు ఆయా స్టేషన్ లకు బయలుదేరాయి.