telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

మూడేళ్ళ క్రితం కనబడకుండా పోయి ఇప్పుడు దొరికాడు.. కానీ..?

మాములుగా కనిపించకుండా పోయినవారి మళ్ళీ దొరికితే ఆ ఆనందమే వేరేలా ఉంటుంది. కానీ వారు ఎవరు ఊహించని విధంగా దొరికితేనే అత్యంత బాధ కలుగుతుంది. అయితే ఇల్లందు పట్టణం కాకతీయ నగర్ కు చెందిన విజయ్ అలియాస్ శివ హత్య ఆలస్యంగా వెలుగులోకి  వచ్చింది. 2018 లో శివ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లందు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. శివ అనేక చిన్న చిన్న కొట్లాటలో కేసులు నమోదయ్యాయి. శివ తరచూ గొడవలు చేయడం వలన  రౌడీషీటర్ కేసు నమోదు అయింది. ఎవరితో పడితే వారితో గొడవ పెట్టుకుని విపరీతంగా కొట్టేవాడు, సైకోలాగా వ్యవహరించేవాడు. ఈ క్రమంలో 2018 లో కనబడకుండా వెళ్ళిపోయాడు. కుటుంబ  సభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లందు  పోలీసులు  మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు నాలుగు సంవత్సరాలు కావస్తున్నా మిస్సింగ్ మిస్టరీగా మారింది. చివరికి ఈ రోజు పోలీసులు ఆ కేసును ఛేదించి హత్యగా గుర్తించారు. శివను హత్య చేసి సీఎస్పీ బస్తీలోని హిందూ స్మశానవాటికలో, దుండగులు  పూడ్చి పెట్టారని గుర్తించారు. ఏఎస్పీ శబరీష్ సమక్షంలో ఈ  రోజు పోలీస్ సిబ్బంది పంచనామా నిర్వహించారు.

Related posts