దాదాపు గంటన్నర పాటు వారణాసిలోని రోబర్ట్స్ గంజ్ ప్రాంతంలో ఉన్న హోటల్ లో హైడ్రామా నడిచింది. ఈ హోటల్ లో బస చేసిన ఓ భోజ్ పురి నటి తలకు తుపాకిని గురిపెట్టి, తనను వెంటనే వివాహం చేసుకోవాల్సిందేనని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. వివాహానికి ఆమె ఏ మాత్రం అంగీకరించలేదు. విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకోగా, తుపాకిని పేల్చాడు. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయం కాగా, సీనియర్ ఉన్నతాధికిర ఒకరు తృటిలో తప్పించుకున్నారు.
జానుపూర్ ప్రాంతానికి చెందిన పంకజ్ యాదవ్ (25), తన అభిమాన నటి సమీప హోటల్ లో ఉందని తెలుసుకుని వచ్చాడు. ముంబై నుంచి ఓ సినిమా షూటింగ్ నిమిత్తం 70 మందితో కూడిన సిబ్బంది ఈ ప్రాంతానికి వచ్చింది. వీరిలో హీరోయిన్ రీతూ సింగ్, దర్శకుడు రితీశ్ థాకూర్ తదితరులు కూడా ఉన్నారు. నిందితుడు నివసించే ప్రాంతానికే చెందిన రీతూ సింగ్, ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ, భోజ్ పురి చిత్రాల్లో నటిస్తోంది.
రనూమండల్ పై హిమేష్ రేష్మియా ఘాటు వ్యాఖ్యలు