telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

కుటుంబం కోసం చిరుతనే చంపేశాడు……

లాక్‌డౌన్‌ అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం విభత్సంగా పెరిగిపోయింది. హైదరాబాద్‌ సిటీ శివారు ప్రాంతాల్లో చిరుతలు తరచుగా సంచరించడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రాజేంద్రనగర్‌లో చిరుత రెండు సార్లు అందరినీ కలవరపెట్టింది.  అయితే… తాజాగా కర్ణాటకలో అందరూ ఆశ్చర్యపోయే ఘటన చోటు చేసుకుంది. తన భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా చిరుత పులితో తలపడ్డాడు. ప్రాణాలకు తెగించి.. ఆ చిరుత పులిని హతమార్చాడు. తన ప్రాణాలతో పాటు తన భార్య, కుమార్తె ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని హసన్‌ జిల్లా హరిసెక్రె తాలుకా బెండాక్రె ప్రాంతంలో చోటు చేసుకుంది. భార్య, కుమార్తెతో తన బైక్‌ పై వెళుతున్న రాజ్‌గోపాల్‌పై పులి ఒక్కసారిగా దూకింది. ఈ క్రమంలో ముగ్గురు బైకుపై నుంచి కిందపడిపోయారు. వెంటనే చిరుతపులి వారిపై దాడి చేసింది. చిరుత బారీ నుంచి భార్య, కుమార్తెను కాపాడుకోవడానికి రాజ్‌గోపాల్‌ వీరోచిత పోరాటం చేసి.. పులిని చంపేశాడు. ఈ ఘటనలో గాయపడిన రాజ్‌ గోపాల్‌ కుటుంబాన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఇప్పుడు ఘటన దేశ వ్యాప్తంగా సంచలన రేపుతోంది.  

Related posts