బ్రిటన్లోని ఓ శాకాహార రెస్టారెంటులో దూరారు కొందరు కుర్రాళ్లు. మానవజాతికే శాకాహారులు కళంకమని అన్నారు. చేతిలో పచ్చి మాంసం తీసుకెళ్లిన వారు.. రెస్టారెంటు సిబ్బంది వారిస్తున్నా వినకుండా ఆ పచ్చి మాంసాన్ని అలానే పీక్కుతిన్నారు. ఈ దృశ్యం చూసిన రెస్టారెంటు సిబ్బంది ఖంగుతిన్నారు. ఆ దుండగులకు నేతృత్వం వహిస్తున్న స్వాత్రీజ్ అనే అతను.. శాకాహార వ్యతిరేక ఉద్యమాన్ని ముమ్మరం చేయాలంటూ పిలుపినిచ్చాడు. ఈ ఘటన తర్వాత అతను శాకాహార వ్యతిరేక వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లు సమాచారం. జంతువులను వేటాడటం, వాటిని చంపడం, పచ్చిగా తినడం మనుషుల జన్మ హక్కని అతను పేర్కొనడం గమనార్హం.
previous post
next post
బెంగాల్ను కశ్మీర్లా మారుస్తున్నారు: ఎంపీ అర్జున్ సింగ్