telugu navyamedia
క్రీడలు

భారత జట్టుకు జై కొట్టినందుకు.. బంధించిన దుబాయ్‌ షేక్‌

Man Arrested Dubai shaik  In UAE
భారత ఫుట్‌బాల్‌ జట్టు అభిమానులను ఓ దుబాయ్‌ షేక్‌ బంధించాడు. యూఏఈలో జరుగుతున్న ఏషియన్‌ ఫుట్‌బాల్‌ కప్‌లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 0-2 తో పరాజయం పాలైంది. అయితే మ్యాచ్‌కు ముందు భారత అభిమానులను దుబాయ్‌ షేక్‌ పక్షుల పంజరంలో బంధించాడు. వారితో యూఏఈకి మద్దతు పలుకుతామని బలవంతంగా చెప్పించాడు. 
మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు? అని షేక్‌ ప్రశ్నించాడు. అభిమానులు  మూకుమ్మడిగా.. ‘భారత జట్టుకే మా మద్దతు’ అనగానే.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరంతా యూఏఈ జట్టుకే మద్దతు పలకాలని చేతిలో బెత్తం పట్టుకుని బెదిరించాడు. దాంతో ఫ్యాన్స్‌ యూఏఈకే మద్దతు పలుకుతామని చెప్పడంతో పంజరం నుంచి విడుదల చేశాడు. ఈ తతంగానికి సంబంధించిన వీడియోసోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యూఏఈ అటార్నీ జనరల్‌ స్పందించారు. వివక్షాపూరితంగా వ్యవహరించి, బెదిరింపులకు పాల్పడినందుకు సదరు షేక్‌కు అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.

Related posts