telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

స్నేహితుడి ప్రియురాలిపై .. కన్ను.. 20 ఏళ్ళ జైలు శిక్ష ఖరారు..

SIT Investigation YS viveka Murder

ఈ పోటీ ప్రపంచంలో ఎదుట ఉన్నది ఎవరు అనేది చూసుకునే సమయం కూడా లేదనేది నిజం అని ఒప్పుకోవాలేమో. గతంలో ఇద్దరు భారతీయులు కొట్టుకుంటుంటే, అది చూసి బ్రిటిష్ వారు సంతోషపడేవారు. కానీ ఇప్పుడు ఇద్దరు భారతీయులు కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు నవ్వుకుంటున్నవారు కార్పొరేట్ అనే విదేశీయుడు. దీనిని గమనించే స్థాయిని దాటేసి, తన వారినే తొక్కుకుంటూ ముందుకు పోతున్నామనుకుంటున్న యువతలో జాతీయభావం ఏస్థాయిలో ఉందొ అర్ధం అవుతూనే ఉంది. జాతీయ భావమే లేని మనసులో మారేదానిపై స్పష్టమైన నమ్మకం ఉండదు.. అదే స్థాయి అన్ని నేరాలకు దారితీస్తుంది. తనవారిపైనా దాడికి సిద్ధం చేస్తుంది. తాజాగా, ఒక వ్యక్తి తన స్నేహితుడికే అన్యాయం తలపెట్టాడు. ఆ కథ ఇలా ఉంది. కడలూరులోని పెరియకోటమూలై ప్రాంతానికి చెందిన సత్యమూర్తి, విజయేంద్రన్ స్నేహితులు. అయితే విజయేంద్రన్ ప్రియురాలిపై సత్యమూర్తి కన్నేశాడు. ఈ క్రమంలో 2017 మార్చి 17న సదరు యువతికి ఫోన్ చేసిన సత్యమూర్తి.. విజయేంద్రన్ కు యాక్సిడెంట్ అయిందనీ, కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని అబద్ధం చెప్పాడు. విజయేంద్రన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అన్నాడు. తాను అక్కడికే బైక్ పై వెళుతున్నాననీ, తనతో రావాలని కోరాడు.

దీనితో యువతి అతని బైక్ పై వెంటనే బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో బైక్ పై దారి మళ్లించిన సత్యమూర్తి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే అతని బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి.. పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన కడలూరు మహిళా కోర్టు.. సత్యమూర్తికి 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Related posts