పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో బీజేపీ నేతకు షాకిచ్చారు. బెంగాల్లోని బాలూర్ఘాట్లో ఆదివారం సాయంత్రం జరిగే ర్యాలీ కోసం యూపీ సీఎం యోగి రావాల్సి ఉంది. అయితే తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇవ్వలేదని యోగి కార్యాలయం వెల్లడించింది. యోగికి ఉన్న పాపులారిటీ కారణంగానే మమత కనీసం ఆయన హెలికాప్టర్ను కూడా ల్యాండ్ కానీయలేదని యోగి ఆదిత్యనాథ్ సమాచార సలహాదారు మృత్యుంజయ్ కుమార్ అన్నారు.
ఎయిర్పోర్ట్లో యోగి చాపర్కు అనుమతి నిరాకరించినందుకు నిరసనగా దినాజ్పూర్లో జిల్లా మేజిస్ర్టేట్ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. యోగి విమానం ల్యాండయ్యేందుకు అనుమతి నిరాకరణపై జిల్లా మేజిస్ర్టేట్ సరైన వివరణ ఇవ్వలేకపోయారని బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో బీఎస్ఎఫ్కు చెందిన రాయ్గంజ్ క్యాంప్లో యోగి హెలికాప్టర్ ల్యాండ్ కానుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆయన బాలూర్గాట్కు రానున్నారు.
చీరలకు సిరిసిల్ల బ్రాండ్ అంబాసిడర్ కావాలి: కేటీఆర్