పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందు ఇతర పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మైనార్టీలు గురువారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుమారు 2000 మంది కాంగ్రెస్ కండువా కప్పుకోవడం.. కోల్కతాలో చర్చనీయాంశంగా మారింది.
వీరిలో టీఎంసీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు షకీల్ అన్సారీ కూడా ఉండటం విశేషం. బీజేపీ, సీపీఎం పార్టీల నుంచి మరో ఐదు వందల మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మైనార్టీల చేరికతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం పెరిగిందని రాజకీయ విశ్లేకులు అంటున్నారు.
అభినందన్ మీసాలను “జాతీయ మీసాలు”గా ప్రకటించాలి: రంజన్ చౌదరి