telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నేను స్ట్రీట్ ఫైటర్‌ను మాత్రమే : మ‌మ‌తా

నిన్న ప‌శ్చిమ బెంగాల్‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడిన విషయం తెలిసిందే. అయిన కూడా ఇంకా కొన్ని చోట్ల ఉద్రిక్త‌త‌లు త‌గ్గ‌డంలేదు.. అక్క‌డ‌క్క‌డ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.. అయితే, ఈ ఘ‌ట‌న‌ల‌పై స్పందించిన టీఎంసీ అధినేత్రి, సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ… తాను స్ట్రీట్ ఫైటర్‌ను మాత్రమేన‌ని.. కానీ, ఒంట‌రిగా పోరాటం చేయ‌లేమ‌న్న ఆమె.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయ‌డానికి సిద్ధం చేస్తాన‌న్నారు. 2024 ఎన్నికల కోసం అందరమూ కలిసి పోరాటం చేద్దామ‌ని పిలుపునిచ్చిన దీదీ.. కానీ, అంత‌కంటే ముందు.. కోవిడ్‌పై పోరాటం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.. ఇక‌, దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ నిమిత్తమై 30,000 కోట్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు మ‌మ‌తా బెన‌ర్జీ.. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ఆక్సిజన్‌ను పంపిస్తోంద‌ని ఆరోపించారు. అయితే చూడాలి మరి ఇంకా అక్కడ ఏం జరుగుతుంది అనేది.

Related posts