telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆర్థికాభివృద్ధిని పట్టించుకోకుండా.. మోదీ ప్రభుత్వం రాజకీయాలు: మమత

mamatha benerji

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆర్థికాభివృద్ధిని పట్టించుకోకుండా బీజేపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఈ వాస్తవాలను గ్రహించాలని ఆమె ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు

.ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో ప్రకటించిన కొత్త ప్రాజెక్టుల కన్నా జూన్ త్రైమాసికంలో ప్రకటించిన కొత్త ప్రాజెక్టులు 81 శాతం తక్కువ అని తెలిపారు. ఒక ఏడాది క్రితం ఇదే సమయంలో ప్రకటించిన కొత్త ప్రాజెక్టుల కన్నా 87 శాతం తక్కువ అని వివరించారు. ప్రస్తుతం మన దేశం ఏ స్థితిలో ఉందో యథార్థాలను అందరూ తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ ఎజెండా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నుంచి కేవలం రాజకీయాలకు మారిందని దుయ్యబట్టారు.

Related posts