telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యేల విలీనం చెల్లదని గవర్నర్ కు వివరించాం: భట్టి విక్రమార్క

Batti vikramarka

తెలంగాణలో ఎమ్మెల్యేల విలీనం చెల్లదని గవర్నర్ కు వివరించామని టీ-కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ ను న టీ-కాంగ్రెస్ నేతలుకలిశారు. అనంతరం మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతోందో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు వివరించినట్టు తెలిపారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలు 12 మందిని టీఆర్ఎస్ లోకి తీసుకోవడంపై గవర్నర్ కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేల విలీనం చెల్లదని చెప్పామని, తేదీలతో సహా ఫిరాయింపు ఆధారాలను అందజేశామని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల అంశం కోర్టులోఉందని, సబితా ఇంద్రారెడ్డినికేబినెట్ లోకి తీసుకుని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు.

Related posts