గాంధీభవన్లో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియమితులైన భట్టి విక్రమార్క సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన అంబర్పేట నియోవర్గ సీనియర్ నేత వి. హన్మంతరావును శ్రీకాంత్ అనచరులు అడ్డుకున్నారు. శ్రీకాంత్ కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారంటూ ఆరోపిస్తూ ఆందోళనుకు దిగారు.
దీంతో వీహెచ్ వర్గీయులు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. దీంతో ఇరువర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకున్నారు. బిసిలకు వీహెచ్ అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ సీఎల్సీ లీడర్ భట్టి చాంబర్ ముందు శ్రీకాంత్ తన అనుచరులతో కలిసి ఆందోళన చేపట్టాడు.