telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ప్రాజెక్ట్ భూముల్లో తప్పుడు సమాచారం.. ముగ్గురు అధికారులకు జైలు శిక్ష

SIT Investigation YS viveka Murder

తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ భూముల్లో తప్పుడు సమాచారం ఇచ్చిన ముగ్గురు అధికారులకు జైలు శిక్ష పడింది. మల్లన్న సాగర్ భూముల వ్యవహారం కేసులో ముగ్గురు రెవెన్యూ అధికారులకు జైలు శిక్షతో పాటు జరిమాన విధిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. మల్లన్న సాగర్ భూముల వ్యవహారానికి సంబంధించి హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని భావించిన న్యాయస్థానం మల్లన్న సాగర్ ఎస్ఈ, సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్ కు మూడు నెలల జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశించింది.

Related posts