telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

పుణ్యక్షేత్రంలో ఘోర ప్రమాదం : 44 మంది మృతి

చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది.  ఈ నేపథ్యంలో  ఇజ్రాయెల్ లో దారుణం చోటు చేసుకుంది. ఆ దేశంలోని ఓ పుణ్యక్షేత్రంలో తొక్కిసలాట జరగడంతో ఏకంగా 40 మందికి పైగా మృతి చెందారు. అసలు వివరాల్లోకి వెళితే.. ఉత్తర ఇజ్రాయెల్ లోని లాగ్ బోమర్ ఫెస్టివల్ సందర్బంగా ఒక పవిత్ర సమాధి వద్ద 30 వేల మందికి పైగా యూదులు గుమికుడారు. వీరిలో కొంతమంది ఓ స్టేడియంపైకి ఎక్కరని, అది ఒక్కసారిగా కుప్పకూలిందని సమాచారం అందుతోంది. ఈ ఘటనలో సుమారు 103 మందికి పైగా గాయపడ్డారని క్షతగాత్రులను తరలించేందుకు దాదాపు 500 పైగా బస్సులను ఉపయోగించారని సమాచారం. ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అటు ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులకు సక్రమంగా వైద్యం అందేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

Related posts