బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు దేశంలో కాలం చెల్లిందని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్యాదవ్కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.
దేవుడి దయ ఉంటే సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సాయికిరణ్యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, హజ్ హౌస్ కమిటీ చైర్మన్ వసిఉల్లా, వక్ఫ్బోర్డు చైర్మన్ సలీం, డిప్యూటీ మేయర్ బాబా ఫసీఉద్దీన్, నాయకులు పాల్గొన్నారు.
ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయి: కేఏ పాల్