‘ఎవరు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపిస్తూ, సక్సెస్ టాక్ తెచ్చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాపై తన అభిప్రాయాలు వెల్లడించారు. “‘ఎవరు’ చిత్రాన్ని చూశాను.
మునికాళ్లపై నిలుచోబెట్టేంత టెన్షన్ కలిగించే సినిమా ఇది. కాన్సెప్ట్ అదిరిపోయింది. దర్శకత్వం చాలా బాగుంది. సరైన పద్ధతిలో తీసిన సినిమా ఇది. కంగ్రాచ్యులేషన్స్ అడవి శేష్. ఈ విజయం పట్ల చిత్రబృందాన్ని మొత్తానికి నా అభినందనలు” అంటూ ట్విట్టర్ లో స్పందించారు.