telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎవరు చిత్రంపై .. మహేష్ రివ్యూ ..

maheshbabu review on yevaru movie

‘ఎవరు’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసులు కురిపిస్తూ, సక్సెస్ టాక్ తెచ్చేసుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాపై తన అభిప్రాయాలు వెల్లడించారు. “‘ఎవరు’ చిత్రాన్ని చూశాను.

మునికాళ్లపై నిలుచోబెట్టేంత టెన్షన్ కలిగించే సినిమా ఇది. కాన్సెప్ట్ అదిరిపోయింది. దర్శకత్వం చాలా బాగుంది. సరైన పద్ధతిలో తీసిన సినిమా ఇది. కంగ్రాచ్యులేషన్స్ అడవి శేష్. ఈ విజయం పట్ల చిత్రబృందాన్ని మొత్తానికి నా అభినందనలు” అంటూ ట్విట్టర్ లో స్పందించారు.

Related posts