రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేష్ బాబుతో చేయనున్నాడు. దీనికి సంబంధించి ఇప్పుడో ఆసక్తికర బజ్ నడుస్తోంది. ఈ మూవీ కోసం విజయేంద్ర ప్రసాద్ కథ రాశాడని.. ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా సినిమా వస్తుందని టాక్ నడుస్తోంది. అయితే.. ఇందులో శివాజీ పాత్రలో మహేష్ బాబు నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్పైకి వెళుతుందో ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..కాగా ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమాలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా జాతీయ అవార్డు గ్రహిత కీర్తీ సురేష్ ఇందులో హీరోయిన్గా కనిపించనుంది. అయితే ఈ చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్ను ఇటీవల ప్రకటించింది. అన్ని అనుకున్నట్లే జరగితే ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసేందుకు చూస్తున్నారు. మహేష్ తాజా చిత్రం సరిలేరు నీకేవరు సినిమాను అనిల్ రావిపూడితో కలిసి చేశాడు.
previous post