వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ 25వ చిత్రం “మహర్షి” మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఆ విజయాన్ని తన ఫ్యామిలీతో విదేశాలలో జరుపుకుంటున్నాడు మహేష్. షూటింగ్ గ్యాప్లో తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకి వెళ్లే మహేష్ “మహర్షి” చిత్రం విడుదలైన తర్వాత జర్మనీ వెళ్ళారు. అక్కడ ఫ్యామిలీతో సరదాగా సమయాన్ని గడిపిన తర్వాత ఇటలీకి బయలుదేరారు. అక్కడ కొన్ని రోజులు హాలీడే మూడ్ని ఎంజాయ్ చేసిన తర్వాత హైదరాబాద్కి రానున్నారు. వారం తర్వాత అనీల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్ర షూటింగ్లో పాల్గొననున్నాడు మహేష్. ఈ చిత్రం మహేష్ 26వ చిత్రంగా తెరకెక్కనుండగా ఇందులో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. విజయశాంతి కీలక పాత్రలో నటించనున్నారు.
previous post
కుందేలు అని శ్రీముఖిని అనలేదు : నోయెల్