telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

30 ఏళ్ళ తరువాత… మహేష్ మదిలో “కొడుకు దిద్దిన కాపురం” జ్ఞాపకాలు

Mahesh

ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. “స‌రిలేరు నీకెవ్వ‌రు” చిత్రంలో మ‌హేష్ మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బండ్ల గ‌ణేష్‌, విజ‌య‌శాంతితో పాటు ప‌లువురు సినీ న‌టులు చిత్రంలో న‌టిస్తున్నారు. ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. “స‌రిలేరు నీకెవ్వ‌రు”లో త‌మ‌న్నా స్పెష‌ల్ డ్యాన్స్ చేస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇస్తుండడం అంచనాలని పెంచుతోంది. విజయశాంతి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. విజయశాంతి, మహేష్ బాబు 30 ఏళ్ల క్రితం కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో విజయశాంతి, మహేష్ తల్లికొడుకులుగా నటించారు. తాజాగా మహేష్ బాబు ఆ చిత్రాన్నిగుర్తు చేసుకున్నాడు. కొడుకుదిద్దిన కాపురం చిత్ర సెట్స్ లో విజయశాంతితో కలసి ఉన్న ఓ అందమైన ఫోటోని షేర్ చేశాడు. “1989లో కొడుకు దిద్దిన కాపురంలో విజయశాంతిగారితో కలసి నటించా. కాలం చాలా వేగంగా మారిపోయింది. మళ్లీ 30 ఏళ్ల తర్వాత ఆమెతో కలసి నటిస్తున్నా” అని మహేష్ పేర్కొన్నాడు.

Related posts