హీరోగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ తొలిసారి నిర్మాతగా మారి “మీకు మాత్రమే చెప్తా” అనే సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. షమీర్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, ఇందులో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అవంతికా మిశ్రా కథానాయికగా నటిస్తుంది. అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. సినిమాను నవంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ని ఈ రోజు సాయంత్రం 6.02ని.లకి మహేష్ బాబు విడుదల చేశారు. వెన్నెల కిషోర్ వాయిస్ ఓవర్ తో మొదలైన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతోంది. ట్రైలర్ పై మీరు కూడా ఓ లుక్కేయండి.
previous post
విజయ్ సేతుపతి సినిమాలో సమంత నటించడానికి అసలు కారణం ఇదే…!