telugu navyamedia
సినిమా వార్తలు

సైదాబాద్‌ చిన్నారి హత్యాచారంపై మహేశ్‌ ఆవేదన

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి అని అధికారులను మహేష్ కోరారు. ‘ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం’ అంటూ మహేశ్‌ ఎంతో ఎమోషనల్‌ అయ్యారు.

హీరో మంచు మనోజ్‌ సైతం బాలిక హత్యాచారం కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మనోజ్‌.. ఈ దారుణ ఘటనకు మనమందరం బాధ్యత వహించాలని పిలుపునిచ్చాడు. కాగా సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండడంతో సిటీ పోలీసులు గతంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడి సీసీ ఫుటేజీ, ఫొటోలు బయటకు వచ్చినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు రాజుపై 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. నిందితుడు రాజుకు సంబంధించిన ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు.

 

Related posts