telugu navyamedia
సినిమా వార్తలు

“మహర్షి”ని బిగ్గెస్ట్ హిట్ చేసినందుకు థ్యాంక్స్ : మహేష్

maharshi

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పూజా హెగ్దే జంటగా వంశీ పైడిపల్లి రూపొందించిన చిత్రం “మహర్షి”. మే 9న “మహర్షి” ఫస్ట్ షోతోనే మంచి టాక్ తెచ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మహేష్ కు 25వ చిత్రం కావడంతో మహేష్ సైతం ఈ విజయాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం మహేశ్ అభిమానులు, చిత్రబృందం, డైరెక్టర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. “నా 25 సినిమా “మహర్షి”ని బిగ్గెస్ట్ హిట్ చేసినందుకు అభిమానులు, సినీ ప్రియులకు ప్రతి ఒక్కరికి నా తరఫున, నా చిత్రబృందం తరఫున పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద విజయం చేసినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి నా తరపున.. నా టీమ్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని మహేశ్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను డైరెక్టర్ వంశీ పైడిపల్లిని ట్యాగ్ చేస్తూ మహేశ్ ట్వీట్ చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే.

Related posts