telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

సర్కారు వారి పాట పరిస్థితి ఏమిటో ఫ్యాన్స్‌ కు అర్థం కావడం లేదా..?

మహేశ్‌బాబు 2019 డిసెంబర్‌లో సరిలేరునీకెవ్వరు షూట్‌లో పాల్గొన్నాడు. సరిలేరు రిలీజ్‌ తర్వాత చాలాకాలం వెయిట్‌ చేసి మహేశ్‌.. కృష్ణ బర్త్‌డే సందర్భంగా గీత గోవిందం ఫేం పరశురామ్‌ దర్శకత్వంలో ‘సర్కారువారి పాట’ను ఎనౌన్స్‌ చేశాడు. త్వరలో షూటింగ్‌ మొదలంటూ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను ఉషారెత్తిస్తున్నారేగానీ.. లేటవడంతో నీరుగార్చేస్తున్నారు.సర్కారువారి పాట షూటింగ్‌ శనివారం లాంఛనంగా మొదలవడంతో శాటిస్‌ఫై అయ్యారేగానీ.. రెగ్యులర్‌ షూటింగ్‌ ఇప్పట్లో స్టార్ట్‌ కాదని తేలిపోయింది. సర్కారువారిపాట కథను అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో రాసుకున్నాడు పరశురామ్‌. వీసాలు రెడీ చేస్తున్న టైంలో.. కరోనా సెకండ్‌ ఫోజ్‌ చిత్ర యూనిట్‌ను భయపెడుతోంది. అమెరికా వెళ్లే ఆలోచనను చిత్ర యూనిట్ విరమించుకుంది. జనవరి మొదటివారం వరకు రెగ్యులర్‌ షూటింగ్ మొదలుకాదని ఎనౌన్స్‌ చేసేశారు నిర్మాతలు. ఇండియాలోనే తీస్తే.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేసేసేవాళ్లు. అమెరికా వెళ్లడం కోసం.. జనవరి అంటున్నారా? ఒకవేళ అప్పటికి కూడా కరోనా తగ్గకపోతే.. సర్కారువారిపాట పరిస్థితి ఏమిటో ఫ్యాన్స్‌ కు అర్థం కావడం లేదు. కరోనా ఎఫెక్ట్‌తో హీరోలందరూ ఏడెనిమిది నెలలు మేకప్‌ వేసుకోకుండా వుంటే..మహేశ్‌కు ఈ ఏడాది మొత్తాన్ని హాలిడేగా ప్రకటించేసుకున్నాడు. ఈమధ్య ఏడాదికి ఒకట్రెండు సినిమాలతో వస్తున్న మహేశ్‌.. మరోసారి గ్యాప్‌లో పడ్డాడు. నిర్మాతలు ఎనౌన్స్‌ చేసినట్టు.. పాటను జనవరిలో స్టార్ట్‌ చేసి … అంతా సవ్యంగా జరిగితే.. 2021 దసరాకో.. దీపావళికో విడుదల చేస్తారేమో చూడాలి. స్పాట్ (‘సరిలేరునీకెవ్వరు డ్యాంగ్ డ్యాంగ్‌ సాంగ్‌)

Related posts