వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం “మహర్షి”. మంచి మెసేజ్తో రూపొందిన ఈ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మ ణ్ తన ట్విట్టర్ ద్వారా చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. “మహర్షి” చిత్రం చాలా నచ్చింది. ఈ చిత్రం అందించే బలమైన సందేశం మనందరికి చాలా ముఖ్యం. మహేష్ మరోసారి పవర్ ఫుల్ ప్రదర్శన చేశారని లక్ష్మణ్ ట్వీట్ చేశారు. అయితే కొద్ది రోజులుగా వరల్డ్ కప్ టూర్తో బిజీగా ఉన్న నేపథ్యంలో లక్ష్మణ్ కాస్త లేటుగా ఈ చిత్రాన్ని వీక్షించినట్టు తెలుస్తుంది. ఈ ట్వీట్కు మహేష్ రిప్లై ఇచ్చాడు. `చాలా ధన్యవాదాలు సర్. సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంద`ని మహేష్ ట్వీట్ చేశాడు. మరోవైపు దర్శకుడు వంశీపైడిపల్లి.. లక్ష్మణ్ చేసిన ట్వీట్ను రీ-ట్వీట్ చేశాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్ బ్యానర్లపై దిల్రాజు, పొట్లూరి ప్రసాద్, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించి ఎపిక్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. “మహర్షి” చిత్రం జూన్ 27తో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకు “సరిలేరు నీకెవ్వరు” టైటిల్ ను ఖరారు చేశారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
previous post
next post