సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానుంది. బుధవారం విడుదలైన చిత్ర ట్రైలర్కు మంచి ఆదరణ లభిస్తోంది. సెలెబ్రిటీలు కూడా సైరా ట్రైలర్ చూసి ఫిదా అయిపోతున్నారు. బాలీవుడ్ టూ టాలీవుడ్ వరకు అంతా చిరంజీవి నటన చూసి పడిపోతున్నారు. సైరా ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 34 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్ చూసి మహేష్ బాబు కూడా స్పందించాడు. ట్రైలర్ విజువల్ వండర్గా ఉందని చెప్పిన మహేష్.. ట్రైలర్లోని ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉందని ప్రశంసించాడు. చిరంజీవి నటన అద్భుతంగా ఉందని, అమితాబ్, చరణ్, సురేందర్ రెడ్డి, రత్నవేలుతో పాటు యూనిట్ను మెచ్చుకుంటూ ట్వీట్ చేసాడు. మహేష్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Exceptional visuals. The grandeur of the film is evident in every frame of the trailer! Chiranjeevi garu…👌👏👍 @SrBachchan sir #RamCharan @DirSurender @RathnaveluDop & the entire team… great work!!! Looking forward to Sye Raa Narasimha Reddy!
— Mahesh Babu (@urstrulyMahesh) 19 September 2019
నాగశౌర్యను మెగా హీరోలు తోక్కేస్తున్నారు… హీరోయిన్ వ్యాఖ్యలు