సూపర్స్టార్ మహేష్ హీరోగా.. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పి.వి.పి సినిమా పతాకాలపై రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్స్టార్ మహేష్కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని చాలా పెద్ద స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31 సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేశారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ముందుగానే ప్రకటించారు. అయితే “మహర్షి” విడుదల తేదీని ఏప్రిల్ 5 నుంచి 26వ తేదీకి మారుస్తారని అంటున్నారు. ఎందుకంటే గతంలో మహేష్ నటించిన పోకిరి, భరత్ అనే నేను చిత్రాలు ఏప్రిల్ చివరి వారంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
ఇప్పుడు “మహర్షి” విషయంలో కూడా మహేష్ అదే సెంటిమెంటును ఫాలో అవుతాడని ఫిలిం నగర్ టాక్. అంతేకాకుండా ఏప్రిల్ 5 వరకు సినిమా పనులన్నీ పూర్తికాకపోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షెడ్యూల్ పూర్తయింది. జనవరి రెండో వారం నుంచి మార్చి వరకు జరిగే షెడ్యూల్తో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.
సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సూపర్స్టార్ మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. కామెడీ కింగ్, హీరో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ తారాగణం నటిస్తోన్న ఈ “మహర్షి” చిత్రం హై టెక్నికల్ వేల్యూస్తో రూపొందుతోంది.
ఆ ముగ్గురు హీరోయిన్లే డిమాండ్ చేస్తారు… హీరోయిన్లపై ప్రియమణి కామెంట్స్