telugu navyamedia
సినిమా వార్తలు

దిల్ రాజుపై మహేష్ అభిమానులు ఫైర్

Dil-Raju

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం “మహర్షి”. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ బాబు నటిస్తోన్న 25వ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు. కానీ ఇప్పుడు కొన్ని కారణాలతో సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 25కు మార్చారు. దీంతో దిల్ రాజుపై మహేష్ అభిమానులు మండిపడుతున్నారు. ఏప్రిల్ 25న సినిమాను విడుదల చేయొద్దని, రిలీజ్ డేట్ ను మార్చాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

హాలీవుడ్ చిత్రం “అవెంజర్స్ : ఎండ్ గేమ్” ఏప్రిల్ 26నే విడుదల కాబోతోంది. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. అంతేకాదు నిర్మాతలు “అవెంజర్స్” సిరీస్ లో వచ్చే ఆఖరి చిత్రం ఇదేనని ప్రకటించడంతో ఎంతోమంది ఈ సినిమా గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. “అవెంజర్స్” సిరీస్ లో రాబోయే ఆఖరి చిత్రం కావడంతో ఈ చిత్రానికి ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు ఒకరోజు ముందుగా “మహర్షి” విడుదలైతే… ఖచ్చితంగా “అవెంజర్స్” ఎఫెక్టు సినిమాపై పడుతుందని ఆందోళన చెందుతున్నారు మహేష్ అభిమానులు. మరి ఈ విషయంపై దిల్ రాజు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related posts