కార్తీ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం “ఖైదీ”. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి సామ్ సీఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంలో హీరోయిన్, పాటలు ఏమి లేకుండా అద్భుతంగా నడిపించారు. పక్కా మాస్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తీ యావజ్జీవ శిక్ష పడిన ఖైదీగా కనిపించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకి మరో హైలైట్. పాజిటివ్ టాక్తో దూసుకెళుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. తాజాగా “ఖైదీ” సినిమాను చూసిన మహేశ్ చిత్ర యూనిట్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. “ఖైదీ.. న్యూ ఏజ్ ఫిలిమ్ మేకింగ్. గ్రిప్పింగ్ స్క్రిప్ట్, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్స్లు, అద్భుతమైన పెర్ఫామెన్స్లున్నాయి. పాటలు లేవు. ఈ మార్పుకు స్వాగతం. కార్తి, నరేన్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సహా ఎంటైర్ యూనిట్కు అభినందనలు” అన్నారు మహేశ్. కాగా సంక్రాంతికి ‘సరిలేరునీకెవ్వరు’ చిత్రంతో మహేశ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న “ఖైదీ” చిత్రానికి సీక్వెల్ వస్తుందంటున్నారు. మరి ఈ సీక్వెల్ ఎప్పుడు రూపొందనుందో చూడాలి.
previous post
“ప్రధాని నరేంద్ర మోడీ మీదనే పోరాటం చేసిన ప్రకాష్ రాజ్ “మా”.. లో .. ఇలా ..?” -శివాజీ