telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘సరిలేరు నీకెవ్వరు’ రేటింగ్… బాహుబలిని మించిపోయిందిగా

sarileru

సంక్రాంతి కానుకగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ జనవరి 11న విడుదలైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. అయినప్పటికీ ఇటీవల జెమిని టీవీలో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూశారు. ఉగాది కానుకగా మార్చి 25న సాయంత్రం 6 గంటలకు ‘సరిలేరు నీకెవ్వరు’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను జెమిని టీవీ ప్రసారం చేసింది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో టెలివిజన్ వ్యూవర్‌షిప్ రేటింగ్ (టీవీఆర్) వచ్చింది. 23.4 టీవీఆర్‌ను ‘సరిలేరు నీకెవ్వరు’ సొంతం చేసుకుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇదే అత్యధిక టీవీఆర్. గతంలో ‘బాహుబలి 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు 22.7 టీవీఆర్ రాగా ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’ దాన్ని దాటేయడం విశేషం. అయితే, ఈ సినిమా రికార్డు స్థాయిలో టీవీఆర్ రావడానికి బలమైన కారణమే ఉంది. లాక్‌డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరమితమయ్యారు. దీంతో ఎక్కువ టెలివిజన్ వ్యూవర్‌షిప్ రేటింగ్ వచ్చింది.

Related posts