టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ మహేష్, నమ్రత లాక్డౌన్ సమయాన్ని చక్కగా ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఈ జంట తరచూ సోషల్ మీడియా ద్వారా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల నమ్రత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మహేష్,గౌతమ్ ఆడిన ఓ ఫన్నీ గేమ్ వీడియో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ కపుల్ వింకింగ్ గేమ్ ఆడి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వింకింగ్ గేమ్ అంటే ఇందులో ఇద్దరు వ్యక్తులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ రెప్ప ఆర్పకూడదు. ఆర్పితే వారు ఓడిపోయినట్టే. ఈ గేమ్లో గౌతమ్ ఓడిపోయాడు. నమ్రత కూడా మహేష్తో ఆడి ఓడిపోయింది. మహేష్తో ఈ గేమ్లో గెలవలేకపోయాను అని నమ్రత చెప్పుకొచ్చింది. రొమాంటిక్ గా ఉన్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
previous post
next post