telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జనవరి 10 అంటే ఆ స్టార్ హీరోలకు హడల్… ఎందుకంటే…!?

AY

తాజాగా అల్లు అర్జున్ తన సినిమా “అల వైకుంఠపురంలో” విడుదల తేదీని మార్చాలని అనుకుంటున్నట్టు ఓ వార్త బయటకు వచ్చింది. జనవరి 10వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ఈ తేదీకి దర్శకుడు త్రివిక్రమ్ అభ్యంతరం తెలిపినట్టు తాజా సమాచారం. త్రివిక్రమ్ రూపొందించిన `అజ్ఞాతవాసి` గతంలో జనవరి 10వ తేదీనే విడుదలైంది. ఆ సినిమా డిజాస్టర్‌గా నిలవడమే కాకుండా త్రివిక్రమ్‌ను అపఖ్యాతి పాలు చేసింది. దీంతో ఆ డేట్ అంటే త్రివిక్రమ్ భయపడుతున్నాడట. మరోవైపు మహేష్‌కు కూడా జనవరి 10వ తేదీ పీడకలను మిగిల్చింది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటించిన `వన్: నేనొక్కడినే` సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదలైంది. ఆ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. విశేషమేమిటంటే.. గతంలో `అజ్ఞాతవాసి`తో చేదు అనుభవం ఎదుర్కొన్న హారికాహాసినీ సంస్థే ప్రస్తుతం `అల వైకుంఠపురములో..` నిర్మించింది. అలాగే గతంలో `వన్:నేనొక్కడినే` నిర్మించిన అనిల్ సుంకర ఇప్పటి `సరిలేరు నీకెవ్వరు`కు నిర్మాత. షూటింగ్‌లు ప్రారంభమైనప్పుడే `అల వైకుంఠపురములో..`, `సరిలేరు నీకెవ్వరు` సినిమా టీమ్‌ల మధ్య వార్ కూడా మొదలైంది. విడుదల తేదీ విషయంలో రెండు చిత్రబృందాల మధ్య అగ్గి రాజుకుంది. జనవరి 12వ తేదీనే తమ సినిమా విడుదల కావాలని ఇరువురూ పంతాలకు పోయారు. అయితే సినీ పెద్దలు రాజీ కుదర్చడంతో `సరిలేరు నీకెవ్వరు` 11న, `అల వైకుంఠపురములో..` 12న విడుదలకు సిద్ధమయ్యాయి.

Related posts