తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి, సోమవారం కలిసిరావడంతో శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే శివదర్శనం కోసం ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగిపోతున్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాలలోని కాకుండా, దేశంలో ఉన్న శైవ క్షేత్రాలలో నేడు విశేష పూజలు జరుగుతున్నాయి. నేడు ప్రజలు శివనామ స్మరణతో, ఉపవాసంతో, జాగరణ పాటిస్తూ శివునికి దగ్గరగా ఉండదలుస్తారు.
మహాశివరాత్రి సందర్భంగా తెలుగు ప్రజలకు ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు నాయుడు, కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.