telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

బొమ్మ తుపాకి అనుకొని.. కాల్చుకుని యువకుడి మృతి

gun fire

బొమ్మ తుపాకిగా భావించిన ఓ యువకుడు తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్ర, థానే జిల్లాలోని షాహాపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. అటగావ్‌లోని రెసిడెన్షియల్ కాలనీలో ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న సిద్ధేశ్ జనగం (28) దీనికి హాజరయ్యాడు.ఈ సందర్భంగా ఇంట్లో తుపాకి కనిపించడంతో దానిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించాడు.

బొమ్మ తుపాకిగా భావించి తన తలకు గురిపెట్టుకుని, సరదాగా ట్రిగ్గర్ నొక్కాడు. వెంటనే లోపలి నుంచి దూసుకొచ్చిన బుల్లెట్ అతడి శరీరాన్ని ఛిద్రం చేసింది. కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. తుపాకి పేలిన శబ్దానికి అందరూ అక్కడికి చేరుకోగా సిద్ధేశ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts