మహారాష్ట్రలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 147 మందికి ‘కరోనా’ సోకింది. ఇక ఈ వైరస్ బారిన పడిన మహిళల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు.
ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటన చేశారు. మెటర్నిటీ కేంద్రాలకు సమీపంలో వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. మహిళల కోసం నిర్మించబోయే ఈ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, 100 పడకలు ఉంటాయని పేర్కొన్నారు.