telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మహారాష్ట్రలో 147 మందికి కరోనా.. మహిళల కోసం ప్రత్యేక ఆసుపత్రులు

karona chekup hospital

మహారాష్ట్రలో కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తోంది. దీంతో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 147 మందికి ‘కరోనా’ సోకింది. ఇక ఈ వైరస్ బారిన పడిన మహిళల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు.

ఈ మేరకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రకటన చేశారు. మెటర్నిటీ కేంద్రాలకు సమీపంలో వీటిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని చెప్పారు. మహిళల కోసం నిర్మించబోయే ఈ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, 100 పడకలు ఉంటాయని పేర్కొన్నారు.

Related posts