telugu navyamedia
రాజకీయ వార్తలు

తమ కూటమికి 170 మంది ఎమ్మెల్యేల మద్ధతు: సంజయ్‌రౌత్

sanjay rout on alliance with bjp

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేటి మధ్యాహ్నం శాసనసభలో ఉద్ధవ్ థాకరే తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ట్విటర్ లో స్పందించారు.

ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వానికి 170 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ప్రకటించారు.శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న విశ్వాసపరీక్షలో తమ కూటమికి 170 మంది శాసనసభ్యులు మద్ధతు ఇస్తున్నారని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో మూడు సంకీర్ణ పార్టీలతో కలిసి మహావికాస్ అఘాదీ పక్షాన ఏర్పాటైన అసెంబ్లీలో శివసేనకు 56 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 54 మంది, కాంగ్రెస్ కు 44 మంది సభ్యులున్నారు.

Related posts