మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అలాగే 18 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి.
మహారాష్ట్రలో బీజేపీ కూటమి దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జాతీయ మీడియా సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ అన్ని రెండు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధిస్తాయని తెలిపాయి. హరియాణాలో మాత్రం ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా కొద్దిగా విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించడంతో ఆ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.