మహబూబాబాద్ జిల్లాలో సంచలన ఘటన చోటు చేసుకుంది. భర్త పదే పదే తనను చిత్ర హింసలు పెడుతుంటడంతో భార్య ప్రమీల తట్టుకోలేక తన భర్త మర్మాంగాన్ని కోసింది. ఈ సంచలన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల రెవెన్యూ పరిధిలోని తండాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే..
భర్త బిచ్యానాయక్(45) నిత్యం ఎదో ఒక కారణంతో తనను వేధిస్తున్నాడని కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. అతను గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు గమనించి వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బిచ్యానాయక్ ప్రాణాలు కోల్పోయాడు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రోజూ గొడవలు, తగాదాలతో విసిగిపోయిన ఆమె.. మంగళవారం రాత్రి నిద్రపోతున్న తన భర్త మర్మాంగం భాగంలో కొడవలితో కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు