ప్రముఖ తమిళ నటులు శరత్కుమార్, రాధారవికి మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. వెంటనే వారిని అరెస్ట్ చేయాలనీ ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీని షాక్ కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే… 2017కి ముందు తమిళ నటీనటుల సంఘానికి శరత్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు. రాధారవి కార్యదర్శిగా కొనసాగారు. అయితే ఆ సమయంలో నడిగర్ సంఘానికి చెందిన కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న ఒక స్థలాన్ని ఎవరికీ తెలియకుండా అక్రమంగా అమ్మసినట్లు ఆరోపణలు రావడంతో 2017లో ఓ వ్యక్తి హై కోర్టును ఆశ్రయించాడు. ఇక ఈ విషయంపై వేసిన పిటిషన్ ను కోర్టు శనివారం విచారణ జరిపించింది. మూడు నెలల్లో కేసును తేల్చాలని వెంటనే శరత్, రాధారవిలను అరెస్ట్ చేయాల్సిందిగా కోర్టు పోలీసులను ఆదేశించింది.
next post