బీజేపీ నేతల వ్యాఖ్యల పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాలని సవాలు విసిరారు.
ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ పిచ్చిమాటలు మాట్లాడడం మానుకోవాలని హితవుపలికారు. ఆ పార్టీ కార్యకర్తల్లో నైతిక స్థయిర్యాన్ని పెంచేందుకే బీజేపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని కమల్ నాథ్ విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కమల్నాథ్ వ్యాఖ్యానించారు.