ఇటీవల కాలంలో వెండితెరపై బయోపిక్ ల హవా పెరిగిపోయింది. మూడు దశాబ్ధాలకి పైగా తన నటనతో ప్రేక్షకులని కట్టిపడేసిన బాలీవుడ్ భామ మాధురీ దీక్షిత్. చివరిగా “కళంక్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మాధురీ. ఇందులో బహార్ బేగం అనే పాత్రలో కనిపించి సందడి చేశారు. “కళంక్” చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మీడియాకి కాస్త దూరంగా ఉన్నారు. అయితే మాధురీపై ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ బయోపిక్ చేయాలని సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో వారు మాధురీ దీక్షిత్ ను కూడా సంప్రదించారట. కానీ మాధురీ నో చెప్పి వారికి షాకిచ్చింది. మాధురీ తన బయోపిక్ చేయొద్దని వారిని కోరిందట. “జీవితంలో ఎంతో సాధించాలని ఉంది. నా జీవితంపై బయోపిక్ చేయాలనుకునే వారికి ఒక్కటి చెప్పదలచుకున్నాను. నా జీవితాన్ని వెండితెరపై చూపించడం నాకు ఇష్టం లేదు. ఇలాంటి ఆలోచనలు దయచేసి ఎవరు చేయొద్దు” అని మాధురీ దీక్షిత్ వారిని కోరారట.
previous post
next post