telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన మాధవిలత

madhavi-latha comments

సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి ఖాతాల్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తూ జనంలో పాపులారిటీ తెచ్చుకోవడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు కొంతమంది. వీళ్లల్లో సినీనటి మాధవిలతకుడా వున్నారు. తాజాగా సోషల్ మీడియాలో మరో కామెంటే చేసింది బీజేపీ యువ మహిళా నేత, హీరోయిన్ మాధవీలత. ”సాధారణ జనం మాట్లాడతారు. అదే తెలివైనవారు వాటిని గ్రహిస్తారు. కానీ కుక్కలు మాత్రమే మొరుగుతాయి” అంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టింది. పైగా ఈ పోస్ట్ ఎందుకు పెట్టానో మీకు అర్థమైందని అనుకుంటున్నానని, తాను సోషల్ మీడియాలో చాలా తెలివిగా ప్రవర్తిస్తానని పేర్కొంది మాధవీలత. శ్రీ రెడ్డిని ఉద్దేశించే మాధవిలత ఈ పోస్టుచేసిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇలా కామెంట్ చేయడానికి కూడా కారణం ఉంది. ఇటీవలే మాధవీలత- సాధినేని యామిని మల్లెపూల మ్యాటర్ ఇష్యూలో దూరింది శ్రీరెడ్డి. సాధినేని యామిని టీడీపీ నుంచి బీజేపీకి వచ్చి ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవి దక్కించుకోవడంతో మాధవీలత- సాధినేని యామిని మధ్య వైరం మొదలైంది. ఒకప్పుడు మల్లెపూలు నలిపే కథలు చెప్పి క్రేజ్ తెచ్చుకున్న వారికి పార్టీలో గుర్తింపు ఇవ్వడం కరెక్ట్ కాదని మాధవీలత ఫైర్ అయింది. సాధినేని యామినిని ఇలా కామెంట్ చేయడం చూసిన శ్రీ రెడ్డి మధ్యలో దూరి ”సాధినేని యామినికి నేను సపోర్ట్ చేస్తున్నా. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ కూడా బయటకు తీయవలసి వస్తుంది” అని తెలిపింది. దీంతో ఈ ఇష్యూ చిలికి చిలికి గాలి వానలా తయారైంది.

Related posts