telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మదనపల్లి జంట హత్యల కేసు : అసలు గిట్టు విప్పిన నిందితులు

చిత్తూరులోని మదనపల్లిలో జంటహత్యలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కూతుళ్లను హత్యచేసినట్లు ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. సాయంత్రం మెజిస్ట్రేట్‌ ముందుకు నిందితులను తీసుకు వెళ్లనున్నారు పోలీసులు. అయితే..ఈ కేసులో నిందితులను ఇవాళ మధ్యాహ్నం పోలీసులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆ నిందితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. దెయ్యం పట్టిన మా కూతుళ్లను డంబెల్స్‌తో కొట్టి చంపామని..వాళ్లు మళ్లీ బతుకుతారని పేర్కొన్నారు కూతుళ్ల హత్య కేసు నిందితులు. తమ ఇంట్లో కొన్ని రోజులుగా ఎన్నో మహిమలు జరిగాయని.. ఆ మహిమలు మీకు అర్థం కావని విచిత్రంగా మాట్లాడారు. తమ ఇంట్లో దేవుళ్లు ఉన్నారని.. పూజలతోనే చిన్నకూతురి ఆరోగ్య సమస్య తగ్గించామన్నారు నిందితులు. వారం రోజులుగా అర్ధరాత్రి ఇంటి బయట ఎన్నో పూజలు చేశామని.. 10 రోజులుగా తిండిలేకుండా ఉన్నామని పోలీసులకు సమాధానం ఇచ్చారు. కలియుగం అంతమైంది…ఇక సత్యయుగం మొదలైందని నిందితులు విచిత్రంగా సమాధానం ఇచ్చారు.

Related posts