కశ్మీర్ లోయలో పారా మిలిటరీ దళాలతో కలిసి విధులు నిర్వర్తిస్తున్న క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కోసం ఓ అద్భుతమైన కానుక ఎదురుచూస్తోంది. ధోనీ భార్య సాక్షి ఓ ఖరీదైన వాహనాన్ని ధోనీ కోసం కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని సాక్షినే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ ద్వారా అందరితో పంచుకుంది. ‘మహీ, నిన్ను చాలా మిస్సవుతున్నాను’ అంటూ పోస్టు చేసిన సాక్షి, ఎరుపు రంగు ‘జీప్ గ్రాండ్ చెరోకీ’ వాహనం తాలూకు ఫొటోను కూడా జతచేసింది.
మహీ నీకెంతో ఇష్టమైన ‘రెడ్ బీస్ట్’ వచ్చేసింది. ఇండియాలో ఇదే ఫస్ట్.. అంటూ సాక్షి పేర్కొంది. ధోనీ కోసం సాక్షి కొనుగోలు చేసిన ఈ ‘జీప్ గ్రాండ్ చెరోకీ’ ఖరీదు రూ.1.12 కోట్లు. ధోనీ గ్యారేజిలో ఇప్పటికే ఫెరారీ, హమ్మర్ వంటి వరల్డ్ క్లాస్ కార్లున్నాయి. కాగా, ధోనీ ఆగస్టు 15 వరకు కశ్మీర్ లోయలోనే విధి నిర్వహణలో పాలుపంచుకుంటాడు.
ప్రజల తీర్పుకు చంద్రబాబు వక్ర భాష్యాలు: విజయ సాయిరెడ్డి