నగరంలోని ఓ లాడ్జిలో ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ ప్రైడ్ లాడ్జిలో రెండు రోజుల క్రితం ఓ ప్రేమ జంట దిగింది. ఆ వెంటనే విషం తాగి వీరు ఆత్మహత్య చేసుకున్నారు. గది అద్దెకు తీసుకున్నప్పటి నుంచి వీరు బయటకు రాకపోవడంతో లాడ్జి యాజమాన్యం అనుమానించి పోలీసులకు సమాచారం అందించింది.
అధికారులు లాడ్జి గది తలపులు బద్దలుగొట్టి చూడగా యువజంట విగతజీవులుగా పడి ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. వీరిని మోహన్ నాయక్, స్వర్ణలతగా గురించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.