తెలంగాణాలో మరో విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని బల్మూర్ మండలంలో ఓ ప్రేమ జంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి చెంచుగూడెంకు చెందిన అనిల్ అనే యువకుడు అఖిలను గత కొంత కాలం నుంచి ప్రేమిస్తున్నాడు. అఖిలది బిళ్లకల్ గ్రామం. అయితే వీరి ప్రేమను ఇరు కుటుంబాలు తిరస్కరించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమికులిద్దరు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఆ రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే..ఈ ప్రేమ జంటపై విచారణ జరిపి అసలు నిజాలు తెలుసుకున్నాక మాట్లాడతామని పోలీసులు చెప్పారు. కాగా మొన్న విజయవాడలో దివ్య హత్య ఘటన మరువకముందే..తెలంగాణాలో మరో ఘనత తెలుగు ప్రజలను కలవరపెడుతోంది.