జోష్ సినిమాతో అరంగేట్రం చేసిన అక్కినేని యువహీరో నాగచైతన్య మొదట అనుకున్నంత సక్సెస్ కాలేక పోయాడు. అయితే ఆ తరువాత ఏమాయ చేశావే, 100% లవ్ వంటి అద్భుత హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే తర్వాత వరుస పరాజయాలను చవిచూశాడు. మజిలీ సినిమాతో తన పరాజయాలకు ది ఎండ్ పలికి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. ప్రస్తుతం ఫుల్ జోష్లో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో నాయురల్ బ్యూటీ సాయి పల్లవి హారోయిన్గా నటించింది. ఈ సినిమా కోసం అబిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినమాతో శేఖర్ కమ్ముల ప్రేక్షకులకు ప్యూర్ లవ్ను పరిచయం చేయనున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి స్పందన పొందాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా అనూహ్య ఆదరణ పొందింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని అందరూ వేచి చూస్తున్నారు. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందట. ఈ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఈ విషయాన్ని లవ్ స్టోరీ టీం అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందని అంటున్నారు.
previous post
పార్టీ నుండి వెళ్లిపోతే పదవులకు రాజీనామా చేయాలి: కుంతియా