ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేస్తానంటూ బెదిరించిన ఓ యువకుడిని స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి పేట పరిధిలో జరిగింది. రవి అనే వ్యక్తి ప్రేమించమంటూ బాలికను బెదిరించాడు. ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేస్తానంటూ ఇంట్లోకి దూరి మరీ అమ్మాయిని బెదిరించాడు.
దీంతో భయాందోళనకు గురైన బాలిక కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని రవిని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆపై పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుడు గతంలో ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.
కుట్ర రాజకీయాలకు భయపడను: పవన్ కల్యాణ్