telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ప్రియుడికి మరో యువతితో పరిచయం.. ఆత్మహత్య కు పాల్పడ్డ ప్రియురాలు

Engineering college Fees student sulcide
 ప్రియుడికి మరో యువతితో పరిచయం ఉందన్న విషయం తెలుసుకొని ఆ ప్రియురాలు మనోవేదనకు గురైంది. ప్రేమ విఫలమైందన్న ఆవేదనతో ఆ యువతి హైదరాబాద్‌లోని మియాపూర్ లో ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన అంజలి ఉమామహేశ్వరి (23) స్థానిక  సెంట్రీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
అదే సంస్థలో ఉద్యోగం చేస్తున్న జాజిబాబుతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో జాజిబాబుకు మరో అమ్మాయి వసుంధరతో పరిచయం ఏర్పడింది. ఆమెతో చాట్ చేస్తుండడాన్ని చూసిన ఉమ.. జాజిబాబును నిలదీసింది. దీంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. 
ఉమ తల్లిదండ్రులు కుమార్తెను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివాసముంటున్న మరో కుమార్తె పావని వద్ద వదిలిపెట్టి వెళ్లారు. ఉమ హైదరాబాద్ వచ్చిన తర్వాత జాజిబాబు మరో ప్రియురాలైన వసుంధర నుంచి ఆమెకు మెసేజ్‌లు వచ్చాయి.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉమ బెడ్‌రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts