telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరో ప్రేమజంట ఆత్మహత్య

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రేమ జంటలు వరుస ఆత్మహత్యలు కలకలం సృష్టిస్తున్నాయి.. మొన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జరిగిన రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే.. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని వడ్లమూడి తండలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో పెద్దలు పెళ్లి నిరాకరించడంతో ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే… వడ్ల ముడి తండాకు చెందిన గుగులోతు ప్రశాంత్ అదే తండాకు చెందిన డిగ్రి పూర్తి చదువుతున్న బుక్యా ప్రవీణ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ గత మూడు సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ జంట ఆత్మహత్య పాల్పడ్డట్టు సమాచారం. ఈ ప్రేమ జంట సోమవారం నుంచే ఇంట్లో కనిపించలేదని… వాళ్ల కోసం ఇరు కుటుంబాలు వెతుకుతున్నాయని పోలీసుల విచారణంలో తేలింది. అయితే.. ఈ జంట మొదట విషం తాగి… వడ్ల మూడి తండా సమీపంలోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts